PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి నాయకుడి మృతికి సంతాపం

1 min read

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : చాగలమర్రి పట్టణం నాగులకట్ట వీధికి చెందిన టిడిపి నాయకుడు కార్పెంటర్‌ హుసేన్‌మియ్య(67) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు.విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చాగలమర్రి చేరుకొని మృత దేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు.మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసారు.కార్యక్రమం లో టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్‌బాష,టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి గుత్తి నర్సింహులు,నంద్యాల పార్లమెంటరీ బిసి సెల్‌ స్పోక్‌ పర్సన్ సల్లా నాగరాజు,జెట్టి నాగరాజు,ఆలంసాగారి ఖలీల్‌,షాభా,అమీర్‌,భాష,నాగూర్‌,బషీర్‌,గఫార్‌,అజీం,ఇర్షాద్‌,టైలర్‌ మదార్‌సా,హుసేన్‌ఫీరా,నూర్‌బాష ,ఓబులేసు,రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

About Author