PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిని గెలిపించండి

1 min read

– 25వ వార్డులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: శాప్ చైర్మన్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకుపట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి మద్దతుగా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సంగయ్య పేట, శేష శయనా రెడ్డి నగర్, 25వ వార్డులో కో- ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్ వైసీపీ నాయకులు మార్కెట్ రాజు, రైతు సంఘం బాబు లు శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవింద్రా రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అబ్దుల్ రవూఫ్, లాలు ప్రసాద్, వైసిపి నాయకులు ఉస్మాన్ బేగ్, ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా మైనారిటీ సెల్ జోనల్ ఇంచార్జ్ అబూబక్కర్, బొట్టు రవి, మన్సూర్, పి.రమేష్ తదీతరులు పాల్గొన్నారు.

About Author