PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు పనులు నాణ్యతగా చేపట్టండి

1 min read
చాగలమర్రిలో రోడ్డు పనులు పరిశీలిస్తున్న షేక్ బాబూలాల్

చాగలమర్రిలో రోడ్డు పనులు పరిశీలిస్తున్న షేక్ బాబూలాల్

– వైసీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్
పల్లెవెలుగు, చాగలమర్రి:
చాగలమర్రి– మహాదేవపురం రోడ్డు మరమ్మతు పనులు నాణ్యతగా, వేగవంతంగా వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ సంబంధిత అధికారులను కోరారు. ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద రోడ్డు నిర్మాణ పనులను జి .వెంకటేశ్వర్ రెడ్డి , కాంట్రాక్టర్ శివరాం రెడ్డి , రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఆటంకాలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రజలు కూడా నిర్మాణ పనుల్లో సహకరించాలని సూచించారు. ఈయన వెంట చాగలమర్రి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ షేక్ మహమ్మద్ సుహైల్, డిడిఎస్ సిద్దిక్, మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ తదితరులు ఉన్నారు.

About Author