PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హత్యకు పాల్పడిన ముద్దాయిలు అరెస్టు

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: కర్నూలు జిల్లా, కల్లూరు మండలం చింతలముని నగర్ లో నివాసం ఉంటున్న నారపురం శ్రవణ్ కుమార్, వయస్సు: 26 సం.లు s/o యన్. వర ప్రసాద్, కులం: వైశ్య, వృత్తి: ప్రైవేటు ఉద్యోగం అనే వ్యక్తికి 01.03.2023 వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా మరియు టౌన్ కు చెందిన కొత్త రుక్మిణీ D/o కొత్త వెంకటేష్, కొత్త రమాదేవి, వయస్సు: 18 సం.లు, అను ఆమె తో వివాహం జరిగింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా వారిద్దరికి శోభనం జరగలేదు. దానికి వధువు అయిన కొత్త రుక్మిణీ, ఆమె తల్లితండ్రులు కొత్త వెంకటేష్, కొత్త రమాదేవి అను వారలు సదరు శ్రవణ్ కు మగతనం లేదని, తమ బిడ్డ గొంతు కోసినారని సదరు శ్రవణ్ మరియు అతని తల్లితండ్రులు వర ప్రసాద్, కృష్ణవేణి ల తో గొడవపడినారు. ఈ విషయం మనసులో పెట్టుకొని రుక్మిణీ కి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని ముద్దాయిలైన శ్రవణ్, అతని తల్లి తండ్రులు ప్రసాద్ కృష్ణవేణి లో అవమానపరిచినారు. తరువాత ముద్దాయి శ్రవణ్ హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో సున్తి చేయించుకొన్నాడు. ఈ విషయము గురించి తన భార్య రుక్మిణీ మరియు ఆమె తల్లితండ్రులకు చెప్పినా వారు నమ్మలేదు. అదే సమయములో ముద్దాయి వరప్రసాద్, తన కోడలు ఆమె తల్లితండ్రులు కలిసి, తన కొడుకు కు ఏదో చేసినారని అపోహ పడి, రుక్మిణీ మరియు ఆమె తల్లితండ్రులు వెంకటేష్, కొత్త రమాదేవి లను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని, వారి ప్లాన్ ప్రకారం 14.03.2023 వ తేదీ ఉదయం సుమారు 11.00 గంటల సమయమున ముద్దాయి శ్రవణ్ తన భార్య కొత్త రుక్మిణీ, వయసు: 18 సం.లు, ఆమె తల్లితండ్రులు కొత్త రమాదేవి, వయసు: 38 సం.లు, కొత్త వెంకటేష్, వయసు: 45 సం.లు వనపర్తి నుండి కర్నూలు టౌన్ చింతలముని నగర్ లో ఉన్న తన ఇంటి వద్దకు పిలుచుకొని వచ్చినాడు. వారి ప్లాను ప్రకారం అప్పటికే వర ప్రసాద్, చెన్నమ్మ సర్కిల్ లో ఉన్న ఆంధ్ర ప్యారిస్ మాల్ లో రెండు కత్తులను కొనుగోలు చేసి ఉన్నాడు. రుక్మిణీ మరియు ఆమె తల్లితండ్రులు కొత్త రమాదేవి, కొత్త వెంకటేష్ లు తన ఇంటి వద్దకు రాగానే, ముద్దాయిలైన శ్రవణ్ కుమార్, అతని తండ్రి నారవరపు వర ప్రసాద్ @ ప్రసాద్ అనువార్లు, ముద్దాయి కృష్ణవేణి ని బయట కాపలాగా ఉంచి, కొత్త రుక్మిణిని కింది అంతస్తు లో ఉన్న గదిలో, ఆమె తల్లి తండ్రులు కొత్త రమాదేవి, కొత్త వెంకటేష్ లను మొదటి అంతస్తు లో ఉన్న గది లో ఇష్టం వచ్చినట్లు కత్తులతో పొడవగా, కొత్త రుక్మిణి మరియు ఆమె తల్లి కొత్త రమాదేవి లు అక్కడికక్కడే చనిపోయినారు. కొత్త వెంకటేశ్ తీవ్రముగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నాడు. గాయపడిన కొత్త వెంకటేష్ ఫిర్యాదు మేరకు, Kurnool IV town PS Inspector శ్రీ.పి.శంకరయ్య గారు Cr.No.62/2023 U/s 498 (A), 302, 307 R/w 34 IPC గా కేసు నమోదు చేయటం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్‌పి శ్రీ సిద్దార్థ కౌశల్ గారి ఆదేశాల మేరకు, కర్నూలు టౌన్ డి‌ఎస్‌పి శ్రీ.కే‌.వి.మహేశ్ గారి ఆధ్వర్యములో, ముద్దాయిలైన (1) నారపురం శ్రవణ్ కుమార్, వయస్సు: 26 సం.లు s/o యన్. వర ప్రసాద్, (2) నారపురం వర ప్రసాద్, వయస్సు: 62 సం.లు s/o లేట్ యన్.వెంకట సుబ్బయ్య , కులం: వైశ్య, వృత్తి: వీధులలో ఇడ్లీలు అమ్మే వ్యాపారం, మరియు (3) నారపురం కృష్ణవేణి, వయస్సు: 52 సం.లు, భర్త పేరు. వర ప్రసాద్, అందరి నివాసం: H.No. 77- 55-5-3-A, చింతలముని నగర్, కల్లూర్, కర్నూల్ టౌన్ అను వారలను కర్నూలు 4 వ పట్టణ సి‌ఐ గారు నిన్నటి దినం అనగా 15.03.2023 వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు గుత్తి పెట్రోల్ బాంకు వద్ద అరెస్టు చేయటం జరిగింది. రి నుండి నేరము చేయుటకు ఉపయోగించిన 2 కత్తులను, రక్తం అంటిన బట్టలను స్వాధీనం చేసుకొవడం జరిగింది. వారిని రిమాండు నిమిత్తం JFMC కోర్టు వారి ముందు హాజరు పరుచబడును.

About Author