PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు

1 min read

– అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన కాటసాని సుంకిరెడ్డి( 63 సంవత్సరాలు) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నంద్యాల ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన స్వగ్రామ స్వగృహానికి వెళ్లి కాటసాని సుంకిరెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ కాటసాని సుంకిరెడ్డి కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, మిట్టపల్లి గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని పెద్ద రామకృష్ణారెడ్డి, కలవాయి చంద్రశేఖర్ రెడ్డి, కాటసాని ప్రకాశ్ రెడ్డి ,ఎన్ నాగిరెడ్డి, కాటసాని నాగిరెడ్డి, కాటసాని చిన్న రామకృష్ణారెడ్డి, కానాల రామ సుబ్బిరెడ్డి, గుండం సురేష్ కుమార్ రెడ్డి, గుండం సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author