PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు తోడుగా జగనన్న గోరుముద్ద..

1 min read

– పాఠశాల లో రాగి జావా ప్రారంభం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు తోడుగా మరో పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్దతో పేరుతో రాగిజావ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రాగి జావ అందించే కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు మేరీ సుమలత ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి హాజరై విద్యార్థులకు రాగిజావా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చక్రపాణి, వైసిపి నాయకులు పి.రమేష్, శాలిభాష, పాఠశాల సిబ్బంది తదీతరులు పాల్గొన్నారు.

About Author