PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అదనపు తరగతులకు స్థల పరిశీలన

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : నాడు నేడు – మొదటి విడత కింద గడిగరేవుల జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న పనులను శనివారం నాడు పంచాయిత్ రాజ్ ఇంజనీర్ అధికారులు ఎడ్యుకేషనల్ ఇంజనీర్ ,యం. రామ మోహన్ డిప్యూటీ ఈవో పి. గంగాధర్ , ఏ ఈ ఒ కే. భాస్కర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పాఠశాలకు 7 అధనపు తరగతులు గదులు మంజూరు అయినట్టు. కొత్త తరగతి నిర్మాణాల ఎంపిక లో భాగంగా, పాఠశాలలో 40 సం॥ క్రిందట నిర్మించిన 2 కాసు రూములు శిధిలా వ్యవస్థలో ఉన్న వాటిని పరిశీలించి, వాటిని పూర్తిగా ద్వంసం చేసి కొత్త తరగతి గదుల నిర్మాణాలను మొదలు పెడతామని తెలిపారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యన్. విమల వసుంధర దేవి,సి ఆర్ పి, వి. నాగరాజు, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ జయక్రిష్ణ స్కూల్ కమిటీ చైర్మన్ వి. శ్రీనివాసులు, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author