PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టణ పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టండి

1 min read

– మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం లో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించి,ప్రజారోగ్యం కాపాడడం లో ప్రత్యేక శ్రద్ద వహించాలని కమీషనర్ శానిటేషన్ విభాగం అధికారులను ఆదేశించారు. ఉదయం 5:00గంటలకు పారిశుద్ద కార్మికుల హాజరు ను,మస్టర్ పుస్తకాలను పరిశీలించారు.కార్మిక యూనియన్ నాయకులు,కార్మికుల తో వారి సమస్యల పై చర్చించారు.కార్మికుల సంక్షేమం కొరకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.అనంతరం పట్టణ శివార్లలో శెట్టి వాండ్ల పల్లె రోడ్ నందు ఉన్న డంపింగ్ యార్డు ను పరిశీలించారు.అక్కడ తడి,పొడి చెత్త నిర్వహణ ప్రాజెక్ట్ లు పరిశీలించారు.ప్రతీ రోజు ఎన్ని ట్రిప్పుల వ్యర్థము ట్రాక్టర్లు,ఆటోల ద్వారా వస్తుందని అడిగి తెలుసుకున్నారు.అనంతరం రిజిస్టర్ పరిశీలించారు. ఆయన వెంటనే మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున,ఇతర ఇబ్బంది ఉన్నారు.

About Author