PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

– సీనియర్ నాయకులకు దుశ్శాలవలతో,పూలమాలతో ఘన సన్మానం
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు ఎం భానుగోపాల్ రాజు సీనియర్ నాయకులు రెడ్డప్ప రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు .మొదట బస్టాండ్ కూడలిలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలాభిషేకం, పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అనంతరం తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు కలిసి సమావేశమై భారీ కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది .ముఖ్యంగా సీనియర్ నాయకులు రెడ్డప్ప రెడ్డి, మాజీ సర్పంచులు నేతి వెంకటరమణ, వెంకటరామరాజు ,లక్ష్మయ్య లతోపాటు సీనియర్ నాయకులు నాగసుబ్బయ్య నాయుడు రామ్మోహన్ రెడ్డి, జయచంద్రారెడ్డి ఆంజనేయులు రెడ్డి, జగిలి రామచంద్ర,రాయగంగయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు నాగ సుబ్బమ్మ, ప్రధాన కార్యదర్శి తోళ్ల సురేంద్ర, బీసీ నాయకులు ఆంజనేయులు లను దుశ్శాలవులు, పూలమాలతోతదితరులను ఘనంగా సత్కరించడం జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి పలువురు నాయకులు ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాస్కర్ రాజు, పార్లమెంటు విభాగం తెలుగు యువత కార్యదర్శి నేతి రమేష్ బాబు, మండల ఉపాధ్యక్షులు దుర్గంఆంజనేయులు, రాయ రమణ నాయుడు, ఎన్నారై నాయకులు ఆంజనేయులు నాయుడు, తెలుగు యువత నాయకులు రాయవెంకటేష్ నాయుడు, రాయ వెంకటరమణ నాయుడు, ఎం. టి .నాగార్జున, తుమ్మల రమేష్, పవన్ కళ్యాణ్ ,సీతారామరెడ్డి, చలపతి, వర్ల ఆంజనేయులు, సుబ్బరామరాజు, మధుసూదన్ రాజు ,ఇబ్రహీం, రామకృష్ణ ,టేకూరి వేంకట్రమణ, సుబ్బరామయ్య,ఆటో శివ , మహేష్, వినయ్, రాజ కొండ,బంగారి,బాయప్ప,జయపతి, మనోహర, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author