PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: శ్రీరామనవమి పురస్కరించుకునిపత్తికొండ ప్రాంతంలోని సీతారాముల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో సీతారాముల కళ్యాణం ఉత్సవం కనుల పండుగలో జరుపుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభోపీతంగా జరుపుకున్నారు. కొత్తపేట వాల్మీకి దేవాలయంలో సీతారాముల కల్యాణాన్ని భక్తులు సాంప్రదాయబద్ధంగా జరిపారు. పట్టణప్రముఖులు నాగరత్నమ్మ రామచంద్ర రెడ్డి దంపతులు సీతారాముల దేవాలయాన్ని సందర్శించి రాములోరి వివాహాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల మహోత్సవ కార్యక్రమానికి స్థానికులు ప్రతాప్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సుభాష్ చంద్ర కుమారస్వామి శ్రీనివాసులు బీరప్ప స్వామి శివశంకర జయరాముడు రంగన్న సాయిబాబా లక్ష్మన్న వెంకటరాముడు తదితరులు పాల్గొని పట్టాభిషేకాన్ని ఎంతో వైభవపేతంగా జరిపారు.

About Author