PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు వాణిజ్య విభాగ అధ్యక్షులు టంగుటూరి సీనయ్య కార్యాలయం నందు వారి ఆధ్వర్యంలో వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు ఆర్థిక సహకారంతో పట్టణానికి మరియు చుట్టూ ప్రక్కల గ్రామాలకు చెందిన అనారోగ్యంతో మరియు ఆర్థిక పరిస్థితి బాగాలేక బాధపడుతున్న వారికి 8 మందికి గాను 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అనంతరం వసుధ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ గతంలో కూడా వసుధ ఫౌండేషన్ తరఫున విద్యార్థులకు పుస్తకాలు మరియు ఉపకార వేతనాలు అలాగే కరోనా సమయంలో ఎనిమిది మందికి ఆర్థిక సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా వస్తా ఫౌండేషన్ సహకారంతో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. దాదాపుగా 9 సంవత్సరాల నుండి వసుధ ఫౌండేషన్ వారి సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శివచంద్రయ్య, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు నాగేంద్ర కుమార్, ప్రపంచ ఆర్యవైశ్య సంఘం మహాసభ సెక్రటరీ భరతుడు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కాసుల జంగం శెట్టి, బిగుమల్ల సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ హెడ్మాస్టర్ పక్కిరెడ్డి, టీచర్ నాగరాజు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మల్లారెడ్డి, పక్కిరెడ్డి,ఆర్సి నాగిరెడ్డి, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author