NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేను విన్నాను : నేను ఉన్నాను అన్నమాటను నిజం చేసిన జగన్  

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నేను విన్నాను నేను ఉన్నాను అన్నమాటను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజం చేశాడని స్థానిక ఎమ్మెల్యే కంగాటీ శ్రీ దేవి స్పష్టం చేశారు.శనివారం స్థానిక శ్రీ రామ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స పొందిన లబ్ధిదారులకు అసర ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని నవరత్నాలలో భాగంగా ప్రకటించిన మేరకు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి చికిత్సయే కాదు, చికిత్స తర్వాత పనులు చేయలేక విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని 5000 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు.   అందులో భాగంగా పత్తికొండ శ్రీరామ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా వివిధ ఆపరేషన్ లు చేయించుకున్న 11 మందికి 41,400 రూపాయల చెక్ ను హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కల్పన, నీలకంఠ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది నిరుపేదలు ఉచితంగా చికిత్స పొందుతున్నారని, పేదవారికి కూడా ఈరోజు కార్పొరేటర్ వైద్యం అందుతుందంటే వైయస్సార్ పుణ్యమే అని తెలియజేశారు.

About Author