PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకి బోయల ద్రోహి జగన్ రెడ్డి: టిడిపి పార్టీ వాల్మీకి నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్లలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డా. బి వి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించి వాల్మీకిలు నాయకులు మాట్లాడుతు అసెంబ్లీ తీర్మానం పేరిట ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను దారుణంగా మోసం చేస్తున్నాడు. రాయలసీమ జిల్లాల్లోని వాల్మీకి, బోయలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని మొన్నటీ రోజున అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానం దురుద్దేశంతో కూడుకున్నది. ప్రాంతీయ విభేదాలు తొలగించి రాష్ట్రంలోని వాల్మీకి, బోయలందరిని ఎస్టీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలను అవమానపరుస్తూ, జగన్ తమ మధ్య ప్రాంతీయ చిచ్చు రేపుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇదే విషయంపై ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీతో శాస్త్రీయంగా అధ్యయనం జరిపించి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిన సంగతి తెలియదా. సదరు ప్రతిపాదనపై కొన్ని వివరాలు కోరుతూ ఏడాదిన్నర కిందట కేంద్రం జగన్ సర్కారుకు లేఖ రాసింది. దానికి సమాదానమివ్వకుండా ఎన్నికల సంవత్సరంలో హడావిడిగా అసెంబ్లీలో తీర్మానం చేయడం పచ్చి మోసంగానే చూడాల్సి ఉంటుంది. నాలుగేళ్లలో ప్రధాని, కేంద్ర హోంమంత్రి వద్ద వాల్మీకుల ఎస్టీ అంశంపై ఏనాడూ కనీస ప్రస్తావన కూడా చేయని జగన్ రెడ్డికి ఎన్నికల వేళ ఉన్నఫళంగా వాల్మీకులు గుర్తుకు రావడం పచ్చి రాజకీయం కాక మరేమిటో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి.పాదయాత్రలో ఇచ్చిన హామీని నాలుగేళ్లు విస్మరించి బోయలను మోసం చేసిన జగన్ రెడ్డికి లక్షలాది మంది వాల్మీకులు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.మొన్నటీ రోజున అసెంబ్లీ తీర్మానం పట్ల వాల్మీకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండలం తెలుగుదేశం పార్టీ వాల్మీకి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author