PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూల్ నగరంలో బ్రాండెడ్ షాపింగ్ మాల్ రావడం అభినందనీయం

1 min read

– రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో బ్రాండెడ్ షోరూమ్ లు రావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఏర్పాటుచేసిన కందుకూరు షాపింగ్ మాల్ ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు హెబ్బా పటేల్ ,అనసూయ లతోపాటు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, కందుకూరు షాపింగ్ మాల్ అధినేత కందుకూరు వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరు షాపింగ్ మాల్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో బ్రాండెడ్ షోరూమ్ లు ఏర్పాటు చేయడం అభినందనీయమని వివరించారు. కందుకూరు షాపింగ్ మాల్ అధినేత కందుకూరు వెంకట సత్యనారాయణ కూడా వస్త్ర వ్యాపార రంగంలో తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నారని ఆయన వివరించారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఈ షోరూం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని వివరించారు .అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఏర్పాటుచేసిన ఈ షోరూం కర్నూల్ నగరానికి అందాన్ని తీసుకువచ్చిందని ఆయన వివరించారు. కందుకూరు షాపింగ్ మాల్ వస్త్ర వ్యాపార రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం కందుకూరు షాపింగ్ మాల్ అధినేత కందుకూరు వెంకట సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ తమ షోరూమ్ ప్రారంభానికి రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ రావడం ఆనందంగా ఉందని చెప్పారు. కర్నూలు జిల్లా ప్రజలు కందుకూరు షాపింగ్ మాల్ ను సందర్శించి తమను ప్రోత్సహించాలని కోరారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో వస్త్రాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రముఖ సినీ తా,రలు హెబ్బా పటేల్ అనసూయలు ఈ సందర్భంగా సందడి చేశారు.

About Author