PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ్యోతీబాపూలే జయంతి సందర్భంగా’ఆర్ పి ఐ పార్టీలో భారీ చేరికలు

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా విజయవాడ గాంధీ నగర్ లో గల పార్టీ కార్యాలయంల మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు అమీన్ భాయ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు ముస్లింలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో, గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని దానికి బానిసలైన వ్యక్తులు హత్యలు,అత్యాచారాలకు, దోపిడీలకు పాల్పడుతుంటే ప్రభుత్వం వారిని కట్టడి చేయడంలో విఫలమైందని విమర్శించారు. అంబేద్కర్ వాదులుగా, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలుగా వీటికి వ్యతిరేకంగా పోరాడవలసిన ఆవశ్యకతను ఆయన వివరించారు. సభాధ్యక్షులు అమీన్ భాయ్ మాట్లాడుతూ ముస్లిం యువతీ యువకులు అంబేద్కర్ ఆశయ సాధనలో భాగస్వాములు కావడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యంతో రాజ్యాధికారం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యావంతులైన యువతీ యువకులు పార్టీ కండువా కప్పుకొని పార్టీ సభ్యత్వాన్నితీసుకున్నారు.మహమ్మద్ ముస్తాక్ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా,అడ్వకేట్ లక్ష్మణరావు ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ సెక్రెటరీగా, పటాన్ రియాజ్ ఖాన్ ప్రకాశం జిల్లా లీగల్ సెక్రెటరీగా, అబ్దుల్ రిహానా కృష్ణాజిల్లా మైనారిటీ విభాగం మహిళా అధ్యక్షురాలుగా, అబ్దుల్ అజీమ్, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు .సయ్యద్ అన్వర్, ఎస్ కే రబ్బాని, మామిడి పాక సాయి,, చీమకుర్తి అవినాష్, ప్రదీప్, అష్రాఫ్, రాజా, నీరజ్ , పాల్గొన్నారు. తొలిత వీరంతా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

About Author