PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేద ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ

1 min read

– కే పిఆర్ చారిటబుల్ ట్రస్ట్

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రంజాన్ పండుగ సందర్భంగా కే పీ ఆర్ మైత్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం పేద ముస్లింలకు నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకుల పంపిణీ చేసింది. పత్తికొండ పట్టణంలోని గ్రామపంచాయతీ వెనుక కాలనీలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా , పిల్లలకు నూతన వస్త్రములు, పెద్దలకు చీరలు పంచిపెట్టి తమ ఉదార తను చాటుకున్నారు. K P R మైత్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రామ్మోహన్ ఆధ్వర్యంలో వారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ పండుగకు ఈ నిత్యవసర సరుకులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్ కాజా హుస్సేన్, ముస్లిం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author