రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలో తలముడిపి బాట దగ్గరలో ద్విచక్ర వాహనము టాటా ఏస్ ఢీకొని ఎల్కే తాండ గ్రామానికి చెందిన కేశవులు నాయక్ ,బాబు నాయక్ ,మరొక వ్యక్తి గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులకు అంబులెన్స్ లో ప్రధమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.