PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార్యను దారుణ హత్య చేసిన భర్త… అరెస్టు చేసిన పోలీసులు

1 min read

– భార్యపై అనుమానమే దారుణ హత్య కు కారణమని వెల్లడించిన డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి.
– నిందితుడు ప్రసాద్ పై హత్యా నేరం కేసు నమోదు, కోర్టులో పరిచి రిమాండ్ కు తరలింపు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం యనకండ్లలో భార్యను దారుణంగా హత్య చేసి పరారైన భర్త ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు కొర్రపాటి ప్రసాద్ ను డోన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన ప్రసాద్ కు బనగానపల్లె మండలం యనకండ్ల కు చెందిన మాధవి అనే మహిళతో గత 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి ఒక బాబు పాప ఉన్నారు,భార్య పుట్టినిల్లు యనకండ్ల లో కాపురం ఉంటూ వృత్తిరీత్యా లారీ క్లీనర్ గా పనిచేసే భర్త ప్రసాదు, తాగుడు వ్యసనాలకు లోనై భార్య మాధవి పై అనుమానం పెంచుకున్నాడు. కూలి పనులకు వెళ్లే భార్య తో భర్త ప్రసాద్ తరచుగా గొడవ పడుతుండేవాడు , ఇటీవల గత నెల రోజుల క్రితం కూడా ఈ భార్యా భర్తల కుటుంబ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది, భార్య భర్తలకు ఇద్దరికీ నచ్చజెప్పి పోలీసులు పంపించి వేశారు.ఈ నెల 20 న తెల్లవారుజామున గాఢ నిద్రలో నిద్రిస్తున్న భార్య ను రోకలి బండతో కొట్టడంతో తలపై భాగంలో తీవ్ర రక్త సావ్రమైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మాధవిని దారుణంగా హత్య చేసి పరారైన పోయాడు.మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది, భార్యను హత్య చేసిన ఘటనలో భర్త ప్రసాదు తాను చేసిన నేరాన్నిఅంగీకరించి , స్థానిక వీఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోవడం జరిగింది.భార్యను హత్య చేసిన నిందితుడు ప్రసాదను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించనున్నట్లు డిఎస్పి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

About Author