PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్ రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకర్ జ్యోష్ణకు సన్మానం   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ పట్టణం శ్రీ సాయి ప్రతిభ కళాశాలలో ఇంటర్  మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో నాల్గోవ ర్యాంక్ ,జిల్లా స్థాయి లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని జ్యోష్ణను పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఘనంగా సన్మానించారు.సోమవారం స్థానిక సాయి ప్రతిభ ఇంటర్ కళాశాలలో జరిగిన  రాష్ట్ర స్థాయి ర్యాంకర్ జ్యోష్ణ సన్మాన కార్య్రమంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ,  ప్రతిభ ఉన్న పిల్లల ప్రోత్సాహానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, అలాంటి వారికి ప్రతిభ విద్యాసంస్థలు కూడా ఎల్లప్పుడూ తోడు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి ర్యాంకర్ జ్యోష్ణా కు మేమొంటోను అందజేశారు.పత్తికొండ విద్యార్థిని రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రతిభ విద్యా  సంస్థల చైర్మన్ అరుణాచల రెడ్డి, కళాశాల అధ్యాపకులు నాగేశ్వర రావు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author