PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జొన్నల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన యాగంటి చైర్మన్

1 min read

– తోట బుచ్చిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలంలో.రాష్ట్ర ప్రభుత్వం ఎండియుల ద్వారా అందిస్తున్న ఉచిత జొన్నల పంపిణీ మంగళవారం నాడు మీరాపురం గ్రామంలో యాగంటి ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా యాగంటి ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఎండియుల ద్వారా వారి ఇంటి వద్ద రేషన్ సరుకులను అందించడం జరుగుతుందని అందులో భాగంగా మే నెల నుండి ఉచిత బియ్యంతో పాటు ఒక కేజీ నాణ్యమైన జొన్నలను పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

About Author