PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తిచేనును పరిశీలించిన యువనేత లోకేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం : నియోజకవర్గం బొల్లవరం శివార్లలో పత్తిచేలోకి దిగిన యువనేత లోకేష్ అక్కడ మహిళారైతును కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మహిళారైతు మల్లేశ్వరి మాట్లాడుతూ… రెండెకరాల కౌలుకు తీసుకొని పత్తిపంట వేశాం.కల్తీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంది, పంట చేతికొచ్చేవరకు నమ్మకం లేదు.కూలీఖర్చులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి.గతఏడాది మొక్కజొన్న వేస్తే నష్టం వచ్చింది.నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగడంతో భారంగా బతుకుబండి లాగుతున్నాం.ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి సాయం లేకపోతే వ్యవసాయం చేయడం కష్టం.
లోకేష్ మాట్లాడుతూ…
ఎన్నికల సమయంలో ఏదేదో చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెబుతూ ముద్దులు పెట్టిన జగన్… ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు.వైసిపి నేతల కనుసన్నల్లోనే కల్తీవిత్తనాల మాఫియా నడుస్తోంది.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం.రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేలా చర్యలు తీసుకుంటాం.నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గిస్తాం… ఒక్క సంవత్సరం ఓపికపట్టండి.రాబోయే చంద్రన్న ప్రభుత్వం రైతులు, కౌలురౌతులకు అండగా నిలస్తుంది.

About Author