PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి

1 min read

– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజనా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్తికొండలో  రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశించారు. బుధవారం పత్తికొండ పట్టణం నందు క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు బహిరంగ సభ ఏర్పాట్లు, మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు హెలిప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్,పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి, పత్తికొండ ఆర్డిఓ మోహన్ దాస్, తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author