PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎవరెస్టు స్కూల్​లో.. పూర్వవిద్యార్థుల సమ్మేళనం

1 min read

పల్లెవెలుగు:కర్నూలు నగరంలోని వన్ టౌన్ లోని ఎవరెస్టు పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2000 విద్యా సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాద్యాయులు, ఉపాద్యాయులతో కలిసి మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఆ బ్యాచ్ కు చెందిన విద్యార్థులంతా మంచి స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. చదువు నేర్పిన గురువులను ఎప్పటికి మర్చిపోకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సరోజిని, విద్యార్థులు సముద్రాల శ్రీధర్, అశోక్, నవీన్, ముజాఫర్, జయరాం, వాసవి, అనురాధ, సీమ, తదితరులు పాల్గొన్నారు.

About Author