PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడికి ఘనసన్మానం

1 min read

టీడీపీలోనే బీసీలకు పెద్దపీట   

పల్లెవెలుగు: తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు టీడీపీ బీసీ సెల్​ పార్లమెంట్​ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు. సోమవారం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో భాగంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బీటీ నాయుడుకు సత్రం రామకృష్ణతోపాటు  కర్నూల్ టీడీపీ మైనార్టీ సెల్  షేక్షావలి, కోడుమూరు టిడిపి నాయకులు విజయ్ కుమార్, కర్నూల్ మండలం టిడిపి అధ్యక్షుడు శివ శంకర్ నాయుడు, డిడిపాడు టీడీపీ గ్రామ అధ్యక్షుడు కెవి సుబ్బయ్య, గార్గేపురం టిడిపి యువ నాయకులు  భాస్కర్, గంగారాం, సయ్యద్,చెన్నకేశవులు, సోఫీ బెగ్, నాగేశ్వరరావు, బషీర్  తదితరులు ఖడ్గము, కిరీటము, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కర్నూల్ పార్లమెంట్  తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు మాట్లాడుతూ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి కేటాయించడం అర్శించదగ్గ విషయము. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీజాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పై దృష్టి ఉంచి నిర్ణయం తీసుకున్నారు. రాబోవు ఎన్నికలలో కర్నూలు జిల్లాలో అధిక శాతం ఉన్న బీసీలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో కర్నూలు జిల్లాలో ని మొత్తం స్థానాలను తెలుగుదేశం పార్టీ  కైవసం చేసుకుంటుందని అన్నారు.

About Author