PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరుకుంద ఈరన్న స్వామికి విరాళం అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల పరిధిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన శాశ్వత అన్నదానం కొరకు  ఎమ్మిగనూరు వాస్తవ్యులు పలుట్ల పవన్ కుమార్ రెడ్డి  వారు అబ్బసాని శ్రీహరిరెడ్డి పేరుపై రూ.91,599/-  ను  విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు  శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ మరియు  శ్రీ స్వామి వారి ఫోటోను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఉపప్రదాన అర్చకులు  పూజన్న  స్వామి, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ మరియు దేవస్థాన సిబ్బంది  పాల్గొన్నారు.

About Author