PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పండితులు వద్దిపర్తి పద్మాకర్ స్వామి కర్నూలుకు రాక

1 min read

– 3,4 తేదీలలో గోదాగోకులంలో ధార్మిక ప్రవచనాలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రణవ పీఠాధిపతులు, అభినవ శుక, త్రిభాషా మహాసహస్రావధాని,   బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ స్వామీజీ కర్నూలు పట్టణంలో వెలసిన శ్రీ గోదాగోకులానికి మహర్షుల చరిత్ర అనే అంశంపై ఆగష్టు 3 సాయంత్రం 6 గంటలకు, 4వ తేదీ ఉదయం 10 గంటలకు ధార్మిక ప్రవచనం చేయుటకు వస్తున్నట్లు గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమకాలీన సామాజిక పరిస్థితులకు అవసరమైన ఎన్నెన్నో ప్రసంగాలు చేసి ఎన్నెన్నో అంతర్జాతీయ రికార్డులను సృష్టించిన ఈ మహాపండితుడు కర్నూలు నగరానికి రావడం ఎంతో ఆనందించదగ్గ విషయంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని  తెలిపారు.

About Author