PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ బీమా కింద తక్షణ సహాయం పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :   మండలంలోని రామనపల్లి గ్రామంలో మన్నూరు కాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందింది, బాధిత కుటుంబానికి అండగా వైఎస్సార్‌ బీమా తక్షణ సహాయం కింద రూ 10 వేల రూపాయలు వైఎస్ఆర్సిపి నాయకులు రామన చంద్ర మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శాంతమ్మ, డిజిటల్ అసిస్టెంట్ సుధీర్ లు శుక్రవారం అందజేశారు,ఈ సందర్భంగా రామన చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ బీమా చేసిన కుటుంబాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి సహజ మరణం చెందితే లక్ష రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు,అందులో భాగంగా తక్షణ ఆర్థిక సహాయంగా రూ 10 వేలు మృతురాలి కుటుంబ సభ్యులకు అంద చేయడం జరిగింది అన్నారు, మిగతా 90 వేల రూపాయల మొత్తాన్ని మృతురాలు యొక్క నామిని పేరుపైన ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author