PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెచ్.ఎం గా పదోన్నతి … ఘనంగా సన్మాణం

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ వాసి, స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 8 సంవత్సరాలుగా వ్యాయామ ఉపాధ్యాయునిగా సేవలు అందించి, ఎంతోమంది విద్యార్థులను రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దిన శ్రీ సురేష్ బాబు రాజును సహచర వ్యాయామ ఉపధ్యాయులు ఘానంగా సన్మానిoచారు.సురేష్ బాబు రాజు పదోన్నతి పొంది, బదిలీ పై వెళ్తున్న సందర్భంగా పత్తికొండ వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో   శనివారం ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.సన్మాన కార్యక్రమం లో  వక్తలు మాట్లాడుతూ,ప్రభుత్వ పాటశాల ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, పత్తికొండ సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ చందు నాయక్, రంగస్వామి,రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు నరసయ్య మరియు ఇతర వ్యాయమ ఉపాధ్యాయులు సంజప్ప, పాండు, వేణు, ఆనందరావు, మధు, రాజేష్, మధు, విష్ణు, హనమ్మన్న, అంజి  మొదలగు వారు పాల్గొని,ఆయనకు పూలమాలలు దుశాలువాలతో సన్మానించారు.

About Author