PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచాయితీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం..

1 min read

– గ్రామాల్లో సీజనల్ వ్యాధులు  ప్రబల కుండా సిబ్బంది ప్రతిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి..

– ఎంపీడీవో రాజ్ మనోజ్ ఆదేశం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా: పెదవేగి మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో    జి ఆర్ మనోజ్, కార్యాలయ ఈవో జాన్సన్ గారు, ఇఓర్డ్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జి ఆర్ మనోజ్ మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రైనేజీలు మురికిగుంటలు పైప్ లైన్ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఏఎన్ఎం లు వెక్టార్, హైజిన్ యాప్ ద్వారా నమోదు చేసి అంశాలను పంచాయతీ కార్యదర్శులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వివిధ ప్రభుత్వ స్కీములు సంబంధించి ఈకేవైసీలను పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇప్పటికే సాంక్షన్ అయిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని అదేవిధంగా పంచాయతీ సిబ్బంది అంతా రెగ్యులర్గా హాజరు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను కోరారు. అలాగే విధంగా పంచాయతీలో పన్నూ లు వ 100% వసూలు చెయ్యాలని, పంచాయతి ఆదాయాలను పెంపొందించుకోవాలని కోరారు.

About Author