PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల అభ్యున్నతే లక్ష్యం…ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పేదల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. స్థానిక 45వ వార్డులో మున్సిపల్, సచివాలయ సిబ్బంది, స్థానిక వార్డ్ నాయకులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.విధిలో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మేలు చేసేలా పథకాలు తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో 45వ వార్డ్ వైస్సార్సీపీ నాయకులు sc,st మానిటరింగ్  మెంబర్ ప్రభుదాస్ గారు, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సితార ఇర్ఫాన్ గారు,జమ్మన్న , భాస్కర్ రెడ్డి గారు, షైక్ ,ఖాదర్ బాషా ,సాదిక్ , జోషి రాజ్ , చందు, రామకృష్ణ , శాఖర్వాలి గారు,ఖుద్ధుస్,ప్రేమ, అబ్దుల్లా, అంజి,భరత్,నందు,మహేష్ ,ఇమ్రాన్,ఇమామ్ ,బాషా,మరియు పార్టీ ముఖ్యనాయకులు, వార్డ్ కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author