PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల స్థాయి స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిజినవేములలో బుధవారం  నందికొట్కూరు మండల స్థాయి  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 మరియు 14 బాల, బాలికల 9 క్రీడలకు సంబంధించిన సెలెక్షన్స్ ను ఘనంగా ప్రారంభించారు. బిజినవేముల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  ప్రసన్న లక్ష్మి  ఆధ్యక్షతన గ్రామ సర్పంచి రవి యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ నందికొట్కూరు మండలం ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి , జడ్పిటిసి సభ్యురాలు కలిమున్నిసా  , వైఎస్సార్సీపీ నాయకులు పబ్బతి రవి కుమార్ ,మండల తహసీల్దారు  రాజశేఖర్ బాబు , మండల విద్యాశాఖ అధికారి  ఫైజున్నిస బేగం , నంద్యాల జిల్లా శాప్ కో- ఆర్డినేటర్  రవికుమార్ , నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ శ్రీనాథ్  హాజరయ్యారు .సెలక్షన్స్ లో మండల పరిధిలోని  పాఠశాలల నుండి దాదాపు 300 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ సెలక్షన్స్ లలో  పాల్గొన్నారు .ఈ సెలక్షన్స్ కార్యక్రమంలో నందికొట్కూరు యస్.జి.యఫ్ కో -ఆర్డినేటర్ వీరన్న  మండలం లోని పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు సుంకన్న, పద్మలత,రాగన్న,భాస్కర్ రెడ్డి, సుబ్బన్న, శ్రీనివాసులు, గోకారి పాల్గొన్నారు.

About Author