PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఔట్సోర్సింగ్ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి

1 min read

వేతన పెంపుతో పాటు ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి.

అక్టోబర్ లో జరిగే రాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజన సభను జయప్రదం చేయండి.

పల్లెవెలుగు వెబ్ కడప :  కడప జిల్లా స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజనసభలో కడప ఏపీ జేఏసీ అమరావతి నేతలు జీవన్ చంద్రశేఖర్, కృష్ణ కుమార్,మరియుకాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు. కడప:  (రెవెన్యూ భవన్) రాష్ట్ర ప్రభుత్వ శాఖల పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అందుకుగాను ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జిల్లాలోని అన్ని శాఖల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఐక్యంగా ముందుకు సాగి సమస్యలపై నినదించాలని కడప జిల్లా ఏపీజేఏసీ అమరావతి నేతలు జీవన్ చంద్రశేఖర్, కృష్ణకుమార్ అలాగే ఏపీ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం కడప జిల్లాకు కడప జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజన సభ జిల్లా కాంట్రాక్టర్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ డి తులసీనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా కడప జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ జీవన్ చంద్రశేఖర్ జిల్లా సెక్రెటరీ కృష్ణ కుమార్ వైస్ చైర్మన్ పురుషోత్తం అలాగే కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మహాసభకు విచ్చేసిన ఉద్యోగులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కింద స్థాయిలో అతి తక్కువ వేతనానికి సమయపాలన లేకుండా కూడా పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు సమస్యలను పక్కన పెడితే ముందు సంఘాన్ని బలోపేతం చేసుకుని తర్వాత సమస్యలపై నినదించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సూచించారు. జిల్లాస్థాయిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండి రాష్ట్రస్థాయిలో జేఏసీని బలోపేతం చేసుకుని రాష్ట్ర సంఘం ద్వారా సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ముందుకు సాగాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో క్రింది స్థాయిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సాధకబాధకాలు కూడా పరిగణలోనికి తీసుకుని వేతనాలు పెంచాలన్నారు. వేతనాలు పెంపుతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తక్కువ వేతనానికి పనిచేస్తున్న చిరుద్యోగులకు ప్రభుత్వ పథకాలు అన్నిటిని వర్తింప చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.92 రోజుల ఉద్యమం కారణంగానే రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు కొంతమేర పరిష్కారం అయ్యాయని తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండి కడప జిల్లా శాఖను బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఐక్యంగా ముందుకు సాగినప్పుడే సమస్యలు పరిష్కారమయ్యే మార్గం కనబడుతుందని తెలియజేశారు.

 కడప జిల్లా నూతన కమిటీ ఎన్నిక:కడప జిల్లాకు సంబంధించి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ జేఏసీ నూతన కమిటీ ఆదివారం ఎన్నుకున్నారు కమిటీలో జిల్లా చైర్మన్గా డి తులసీనాథ్ (గృహ నిర్మాణ శాఖ) ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్ (సాంఘిక సంక్షేమ శాఖ) అసోసియేట్ చైర్మన్గా గణేష్ (హార్టికల్చర్) కో చైర్మన్గా వరపుత్ర (మెడికల్ డిపార్ట్మెంట్) నిమిస్తూ వారి ద్వారా జిల్లా కమిటీని బలోపేతం చేసుకోవాలని ఏపీ కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ అలాగే కడప జిల్లా ఏపీజేఏసీ అమరావతి నాయకులు నూతన కమిటీ సూచిస్తూ అభినందనలు తెలియజేశారు. త్వరలో పూర్తిస్థాయిలో కమిటీని నియమించుకుని కడప జిల్లాలో సమస్తాగతంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ జేఏసీని బలోపేతం చేస్తామని నూతన కమిటీ జిల్లా చైర్మన్ డి తులసీమ తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ కడప జిల్లా శాఖ నాయకులు వివిధ శాఖల ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు మరియు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

About Author