ఉప్పలదడియ దర్గాలో మిలాదున్ నబీ వేడుకలు
1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో ఈనెల 28వ తేదీన సుల్తాన్ చమన్ దర్గాలో మిలాదున్ నబి వేడుకలు నిర్వహిస్తుట్లు పీఠాధిపతి సుభహన్ ఖాద్రి తెలిపారు.ఈవేడుకలలో మహమ్మద్ ప్రవక్త గారి అసర్ శారీప్(గడ్డం యొక్క వెంట్రుకలు)జూల్ప్ ముబారక్ (తల వెంట్రుకలు)మరియు ప్రవక్త గారి వస్తువులు చూపించబడునని ఈఅసర్ షరీఫ్ ని నేరుగా దర్శించిన వారికి గ్రహ దోషములు సర్వ రోగాలు దూరం అవుతయాని ప్రతి కోరికలు నేర వేరుతాయాని భక్తుల నమ్మకం ఈ అసర్ షరీఫ్ 28 తేదీన సాయంత్రం 7గంటల నుండి రాత్రి 11 వరకు ఉంటుందని అన్ని పిఠాదిపది శ్రీ సుభహన్ షా ఖాద్రి స్వాములు వారు తెలిపారు.

