PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

17న మండల సర్వసభ్య సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రం ఎంపీడీఓ  కార్యాలయంలో ఈనెల 17వ తేదీ(మంగళవారం)న ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి తెలిపారు.ఉదయం 10:30 కు సమావేశం ప్రారంభం అవుతుందని మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు జడ్పిటిసి,గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.మండలంలో ఉన్న వివిధ సమస్యల గురించి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.అంతేకాకుండా ఈ సమావేశానికి సంబంధించిన మండల అధికారులందరూ తప్పనిసరిగా సమావేశానికి పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.

About Author