PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్యాపిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

1 min read

వై.నాగేశ్వరరావు యాదవ్

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : ఐ హేట్ జగన్ అంటూ,ప్యాపిలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని  తెలుగుదేశం పార్టీ బీసీసాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్  పేర్కొన్నారు. ఈసందర్భంగా శుక్రవారం ప్యాపిలి పట్టణంలో విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైకో ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటన నిన్న అట్టర్ ఫ్లాప్ అయింది. ఐ హేట్ జగన్, జగన్ గో బ్యాక్  అంటూ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, నిరసనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి రాష్ట్రంలో ప్రశాంతంగా తిరగటానికి సైతం భయపడుతున్నాడు.ఈ సైకో ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజల జీవితాలను సర్వనాశనం చేసాడు.ఈ సైకో ముఖ్యమంత్రి ప్రజల జీవితాలతో రాష్ట్ర యువత భవిష్యత్తుతో చెలగాటాలాడుతున్నడు.ఈ కార్యక్రమంలో రామ్మోహన్ యాదవ్, నడిగడ్డ నాగేంద్ర, కోదండరామయ్య యాదవ్,చల్ల వీరాంజనేయులు,ఆర్ మల్లికార్జున,ఆర్సి మద్దిలేటి, బాల రంగన్న, ఎస్కేవలి, ప్రతాపరెడ్డి, శివ కిషోర్, అనుదీపు,కులయప్ప,మెట్టుపల్లి సుంకన్న,వెంగళపల్లి పరమేష్,పుల్లన్న,ఆదినారాయణ,సుంకన్న, రామచంద్రుడు,హెచ్ఆర్ పల్లి కమ్మగిరి రాముడు,హర్షవర్ధన్ శేఖర్, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author