PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళితులపై జరుగుతున్న దాడులు ఆపాలి.. టిడిపి నేతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని కర్నూలు టిడిపి నేతలు అన్నారు. నగరంలోని పాత బస్టాండులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన తెలిపారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. నానా ఇబ్బందులకు గురి చేస్తూ బాధపెట్టడం మంచిది కాదన్నారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందని చెప్పారు. దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు పోతురాజు రవి, జేమ్స్, తిమ్మోజి, బొల్లెద్దుల రామకృష్ణ, సుంకన్న, గున్నామార్క్, యేసు, పామన్న, జహంగీర్ బాషా, ప్రభాకర్, తిలక్, అఖిల్, వార్డు ఇంఛార్జీలు, తదితరులు పాల్గొన్నారు.

About Author