PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బండిమెట్టలో టిడిపి నగరమా మేలుకో కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమాన్ని మంగళవారం నగరంలోని 3 వ వార్డు బండిమెట్టలో నిర్వహించారు. టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు, కార్యకర్తలు వీధుల్లోని ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివ్రుద్ది జరగలేదని.. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కర్నూల్లో టి.జి భరత్ ఎమ్మెల్యే అయితే అభివ్రుద్ది జరుగుతుందన్నారు. కర్నూలుకు పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు రావాలంటే టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి నాగ వీరాంజనేయులు, చంద్రకాంత్, నాయకురాళ్లు ఉమా మహేశ్వరి, రాజేశ్వరి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author