PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

1 min read

-మృతులు దేవనూరు గ్రామానికి చెందినవారు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు  గ్రామానికి చెందిన బోయ రామగురుడు,లక్ష్మీదేవమ్మల కుమారుడు కృష్ణ(32),బోయ శివశంకర్ నాయుడు,పద్మావతి కుమారుడు సుదర్శన్ నాయుడు(20)అను వీరిద్దరూ స్నేహితులు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామం నుండి కర్నూలుకు బైకుపై వెళ్తుండగా గార్గేయపురం చర్చి దగ్గర లారీని క్రాస్ చేస్తూ ఉండగా బైక్ అదుపుతప్పి లారీ టైర్ల కింద పడడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.కృష్ణకు వివాహం అయింది కూతురు కుమారుడు ఉన్నారు.సుదర్శన్ నాయుడుకు వివాహం కాలేదు. ఇద్దరూ మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.ప్రమాదంపై కర్నూలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About Author