PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైక్రో సాఫ్ట్ చైర్మన్​గా స‌త్య నాదెళ్ల

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ఈ మేరకు బోర్డు చైర్మన్‌గా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. 2014 నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా కొనసాగుతున్నారు. తాజాగా బోర్డు ఆయనకు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుత ఛైర్మన్‌ జాన్‌ థాంసన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. స‌త్య నాదెళ్ల తెలుగు ఎన్ ఆర్ఐ. తెలుగు వ్య‌క్తి ఇంత‌టి గొప్ప ప‌ద‌వి ద‌క్కడం ప‌ట్ల ప‌లువురు అభినంద‌న‌లు తెలియజేస్తున్నారు.

About Author