PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

6వ రోజు కొనసాగిన జగనన్నకు తోడుగా పేద ప్రజలకు అండగా

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జగనన్నకు తోడుగా పేద ప్రజలు అండగా “అన్న వస్తున్నాడు” అనే కార్యక్రమంలో భాగంగా పత్తికొండ పట్టణం 19వ వార్డు మడ్డిగేరిలో 6వ రోజు కొనసాగింది.  అన్న వస్తున్నాడు  కార్యక్రమం పత్తికొండ గ్రామంలో 19 వార్డ్ మడ్డిగేరి నందు జరిగింది. సేవాదళ్ కుటుంబ సభ్యుల ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. అన్న వచ్చాడని తమ సమస్యలు  చెప్పుకున్నారు. ప్రతి ఇంటిలో కూర్చుని  కుటుంబాలు చెప్పే సమస్యలను సావధానంగా వింటూ, సమస్యలను పరిష్కార దిశగా తీసుకుపోతున్నారు. సమస్యలు ఉన్నచోట నేనున్నానని ధైర్యం చెప్పి  ఆయన ముందుకు సాగారు. ఇంటి సమస్యల్లో భాగంగా పిల్లలు చదువులు వృద్ధుల ఆరోగ్య సమస్యలు కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. 18, 19 వార్డులలో ఫ్రీ ట్యూషన్ ఏర్పాటుకు త్వరలో  కృషి చేస్తామని చెప్పారు. ఇందుకు తగిన కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తామని మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి  కుటుంబంలో ఆడపడుచుకు చీర, పసుపు,  ఇస్తూ, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పోచిమిరెడ్డి సేవాదళ్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.

About Author