PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే శిల్పాకు అంగన్వాడీల వినతి పత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి మహానంది మండలానికి చెందిన పలువురు అంగన్వాడి కార్యకర్తలు మహానందిలో వినతిపత్రాన్ని అందజేశారు. ఓ శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే టిటిడి కళ్యాణమండపం నుండి బయటికి రాగానే ర్యాలీగా వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జీతం 26వేలకు పెంచేలా ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. 20 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా తమను ఎవరు పట్టించుకోవడంలేదని, అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టి అంగన్వాడీలను అపహస్యం పాలు చేశారని దీనిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి న్యాయం చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నా మీద నమ్మకం ఉంచాలని అంగన్వాడీలను కోరారు. రాబోయే ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని న్యాయం చేస్తామని అంగన్వాడీలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భువనేశ్వర్ రెడ్డి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి ఇతర వైసిపి నాయకులు పాల్గొన్నారు.

About Author