PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పగిడ్యాలలో వైసీపీకి భారీ షాక్..

1 min read

పగిడ్యాల గ్రామ వైసిపి నాయకులు మాండ్ర సమక్షంలో టిడిపిలో చేరిక.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మండల కేంద్రం పగిడ్యాల లో వైసీపీ పార్టీ కి ఊహించని షాక్ తగిలింది. గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీ పార్టీలో చేరారు. శనివారంపగిడ్యాల  గ్రామానికి చెందిన వైసిపి నాయకులు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో పగిడ్యాల గ్రామ నాయకులు నాయకులు పుల్యాల వాసురెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దామోదర్ రెడ్డి ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.కార్యక్రమంలో చాకలి వెంకటేశ్వర్లు, చాకలి నరసింహా, చాకలి బాలకృష్ణ, తెలుగు శ్రీనివాసులు, గొల్ల పెద్ద బిచ్చాలు, గుండెపోగు నాగేశ్వరరావు, బిజ్జరపోగు సురేష్, గొల్ల రంగస్వామి, చిన్న నరసింహ, దాసు, బొరిల్లి జగన్, బోయ మధు, బోయ కురుమన్న, తెలుగు మల్లి, చాకలి రమణ, దాసరి నాగరాజు, మాడుగుల శేఖర్, బతుకన్న తదితరులకు మాండ్ర శివానందరెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి, విజయ్ కుమార్, శేఖర్, చిన్న, డేవిడ్, బోయ పాండు, బాబు, లక్ష్మన్న, సత్తానుబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author