PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీతలకు  సన్మానం

1 min read

సన్మానించిన KPR మైత్రి చారిటబుల్ ట్రస్ట్                           

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను జిల్లా ఉత్తమ అవార్డులు పొందిన డాక్టర్, హెడ్ నర్సును కేటీఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సన్మానించింది. విధులు సక్రమంగా పాటిస్తూ, వీలైనంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన మెరుగైన వైద్య సేవలు అందించిన జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీతలు  హెడ్ నర్స్ శాంత లక్ష్మి, వైద్యాధికారి వెంకటేశ్వర్లును కేటీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సన్మానించింది. ట్రస్ట్ ఫౌండర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉత్తమ అవార్డు గ్రహీతలకు సన్మాన, అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు డాక్టర్ వెంకటేశ్వర్లు హెడ్ నర్స్ శాంత లక్ష్మీ మాట్లాడుతూ, మా వైద్య సేవలకు మెచ్చి గవర్నమెంట్ నుంచి జిల్లా స్థాయి అవార్డు రావడం మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమయానుకూలంగా సేవలు అందించడమే మా బాధ్యత అని అన్నారు. అనంతరం మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రామ్మోహన్ మాట్లాడుతూ, మన మండలంలో వైద్య సేవలు అందించినందుకు గాను డాక్టర్ వెంకటేశ్వర్లు, హెడ్ నర్స్ శాంతా లక్ష్మీ లకు జిల్లా స్థాయి అవార్డు రావడం మనందరికీ  సంతోషకరమైన విషయం అని అన్నారు. రాబోయే రోజుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని ఆయన కోరారు. గత 25 సంవత్సరాలుగా నర్సుగా పనిచేస్తున్న శాంత లక్ష్మికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం డాక్టర్ వెంకటేశ్వరులకి శాంత లక్ష్మికి  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్య సిబ్బంది  దేవా, కళ్యాణి, సీనియర్ వైద్య సహాయకులు పాల్గొన్నారు.

About Author