PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌జ‌ల ఆరోగ్యం బాగుండాల‌నే ఉచిత వైద్య ప‌రీక్ష‌లు చేయిస్తున్నా..

1 min read

టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు ప్ర‌జ‌ల ఆరోగ్యం బాగుండాల‌న్న ఉద్దేశంతోనే త‌మ గౌరిగోపాల్ హాస్పిట‌ల్‌లో గుండెకు సంబంధించిన వైద్య ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా చేయిస్తున్న‌ట్లు క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ తెలిపారు. న‌గ‌రంలోని 8వ వార్డు పెద్ద‌ప‌డ‌ఖానాలో మ‌దీన మెడిక‌ల్స్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఉచిత మెడిక‌ల్ క్యాంపును ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య ఉంటే బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని సూచించారు. క‌రోనా త‌ర్వాత గుండె జ‌బ్బ‌లు పెరిగిపోయిన నేప‌థ్యంలో త‌మ వైద్య‌శాలలో ఉచిత వైద్య ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌న్నారు. దీని వ‌ల్ల‌ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో కుటుంబాల‌ను తాము కాపాడిన‌ట్లు ఆయ‌న తెలిపారు. పార్టీల‌తో సంబంధం లేకుండా ఇలాంటి వైద్య శిబిరాలు ఎవ‌రు పెట్టినా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పోరేట‌ర్ ప‌ర‌మేష్‌, జుబేర్, చేప‌ల ర‌మేష్‌, క‌స్తూరి వెంక‌టేశ్వ‌ర్లు, నాగార్జున‌, బూత్ ఇంచార్జీలు, త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు పాల్గొన్నారు.

About Author