PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరు తెదేపా జెండాను ఎగరేద్దాం..

1 min read

రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం -పీరు సాహెబ్ పేట వైసీపీ కార్యకర్తలు టిడిపిలోకి..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అవసరమని అదేవిధంగా నందికొట్కూరులో తెదేపా జెండాను ఎగరవేద్దామని తెదేపా నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జి మాండ్ర శివానంద రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా  మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట  గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 100 కుటుంబాలు ఆదివారం మాజీ సింగిల్ విండో చైర్మన్ రెడ్డివారి సోమ సుందర్ రెడ్డి,పుల్లారెడ్డి,మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మాండ్ర శివానంద రెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మాండ్ర పసుపు కండువా వేసి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాండ్ర మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు.రానున్న- 2024 సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.అనంతరం ఇడమ కంటి రామేశ్వర రెడ్డి, జనార్దన్ రెడ్డి,విజయ డైరీ మాజీ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి,శేఖర్,మట్టి వెంకటేశ్వర్లు,ధనుంజయ రెడ్డి, రాజేశ్వరరెడ్డి,వెంకటరాజు, లక్ష్మయ్య, శివరాజు,రమేష్ బాబు,వెంకటరమణ, గోపాల్,మట్టి శివ,శ్రీనివాసులు,వడ్డే నాగశేషులు, రంజిత్ కుమార్ రెడ్డి,రామకృష్ణ,తిమ్మప్ప,చిన్న ఉషనయ్య,మధు,బోయ ఆంజనేయులు,మదన్ మెహన్,మాభాష, చెట్టుకింద శ్రీనివాసులు మరో 100 కుటుంబాల వారిని కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ గుండం రమణారెడ్డి,సుభాన్,ప్రమోద్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author