PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ చేతిపంపు ఆక్రమణ..

1 min read

నీటి ఎద్దడి నెలకొనడంతో అధికారులు స్పందించాలని బుజనూర్ గడివేముల గ్రామస్తుల విజ్ఞప్తి..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  (గడివేముల )మండల పరిధిలోని (బూజునూరు) గ్రామ పొలిమేరలో గతంలో మంచినీటి బోరు వేసి చేతిపంపు బిగించిన అధికారులు. అయితే ఒకరు ఆశ్రమం కట్టుకొని చేతిపంపు ఆక్రమించుకొని గ్రామస్తులకు మంచినీటి సౌకర్యాన్ని ఇవ్వనని నిరాకరణ నీ బుద్ధి వచ్చిన వారికి చెప్పుకోండి ఇది నా సొంత స్థలం అంటూ డికెటి భూమిని ఆక్రమించుకున్న ఒక స్వామి గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారిన వైనంపై గ్రామస్తులు ఆగ్రహం వెంటనే అధికారులు స్పందించి చేతిపంపు ఏర్పాటు చేయాలని ఆక్రమణకు గురైన బోరును స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మంచినీటి సౌకర్యం కల్పించాలని వెళ్లి అడిగిన గ్రామస్తులకు ఎవరు నువ్వు అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు గ్రామస్తులు వాపోయారు గ్రామంలో పెద్దలను అడగండి అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రేపు కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామంటూ ప్రజలు వెనుతిరిగారు.

About Author