PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

1 min read

జెడ్పీటీసీ ఎమ్. రవి కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కడప: ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు సేవలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ ఎం. రవికుమార్​ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం వేంపల్లె పట్టణంలోనీ సచివాలయం-1 లో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఉప సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, ఎంపిపి నల్లంగారి లక్ష్మీ గాయత్రీ, సర్పంచ్ జలకం వెంకట లక్ష్మమ్మ, తహసీల్దార్ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ పంచాయతీ ఈవో భూమిరెడ్డి మల్లికార్జునరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలకు దరఖాస్తు చేసుకునే విధానం, తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపిటిసిలు కటిక చంద్రశేఖర్, బాబా షరీఫ్, పఠాన్ రహంతుల్లా, వార్డు సభ్యులు సభ్యులు కొత్తూరు మహేష్, పోలేపల్లి గణేష్, వీఆర్వో సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ, డిజిటల్ అసిస్టెంట్ రాము, వైఎస్సార్‌సీపీ నాయకులు మణి గోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కసిరెడ్డి ఆది నారాయణరెడ్డి, జయరాములు పాల్గొన్నారు.

About Author