PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : బుట్టా రేణుక వెల్లడి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ణీ కళ్యాణ మండపం నందు ఎమ్మిగనూరు తాలూకా పాస్టర్స్ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ఎమ్మిగనూరు అబ్జర్వర్, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూద, ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి “బుట్టా రేణుక”  మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  క్రైస్తవులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం పాస్టర్లకు రూ. 5వేలు గౌరవ వేతనం అందిస్తుందన్నారు. ఎన్నికల్లో తన గెలుపునకు పాస్టర్స్,  క్రైస్తవ, మైనార్టీ లు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బుట్టా శివనీలకంఠ , వైసీపీ పట్టణ అధికార ప్రతినిధి, నాయకులు, నియోజకవర్గ పాస్టర్ల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author