PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గ‌ర్విస్తున్నా.. టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి జిల్లా పార్టీ కార్యాల‌యంలో నిర్వహించిన వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప నాయ‌కుడి నాయ‌క‌త్వంలో ప‌నిచేస్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. తెలుగుదేశం అంటే రాజ‌కీయ పార్టీ మాత్రమే కాద‌ని.. తెలుగు ప్రజ‌ల‌కు ఒక ఎమోష‌న్ అన్నారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయ‌కుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ సారి ఎన్టీఆర్‌కి భార‌త‌ర‌త్న ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్నట్లు భ‌ర‌త్ తెలిపారు. పేద ప్రజ‌ల కోసం ఆయ‌న ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొచ్చార‌న్నారు. తెలుగుప్రజ‌లు ఎన్టీఆర్‌ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటార‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత‌లు, కార్యక‌ర్తలు, అనుబంధ విభాగాల నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author