PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రానున్న ఎన్నికల్లో టిడిపికి ఓటు వేస్తే. అభివృద్ధికి ఓటు వేసినట్టే

1 min read

గౌరు చరితా రెడ్డి

పల్లెవెలుగు వెబ్ గడివెముల: రాష్ట్రంలో అభివృద్ధి టిడిపి పార్టీతోనే సాధ్యమని పాణ్యం  టిడిపి  ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి అన్నారు.ఆదివారం నాడు మండల కేంద్రం గడివేములలో పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలపై డోర్ టు డోర్ ప్రచారం ఎన్నికల శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేసిందే టిడిపి ప్రభుత్వం అని అన్నారు. ఈసారి టిడిపి ప్రభుత్వం అధికారంలో రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15 వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు ఇదే కాకుండా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం యువకుల నిధి కింద నిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు సహాయం బీసీలకు రక్షణ చట్టం అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి, పంట రామచంద్రారెడ్డి,బి సీతారామరెడ్డి,దుర్వేసి కిట్టు, కృష్ణారెడ్డి . శ్రీనివాసులు,కత్తి శివారెడ్డి, దేశం నారాయణరెడ్డి, సుభద్రమ్మ,ఒడ్డు లక్ష్మీదేవి, బి వి యన్ రాజు, ఎస్ ఏ ఫరూక్,  కే బీ మల్లి,ఐ టి డి పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author